విజన్ 2020 ఈ పేరు వినగానే తెలుగునాట టక్కున గుర్తుకు వచ్చే పేరు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రజల మస్తిష్కంలో, ఇలా ఈ పేరు చంద్రబాబుతో ముడిపడి ముద్రపడిపోవడంలో ముఖ్య పాత్ర పోషించింది నాడు చంద్రబాబుకి అనుకూలంగా వ్యవహరించిన పత్రికలు. కానీ ఈ విజన్ 2020 అనేది నిజంగా చంద్రబాబు సృష్టేనా అనేది ఒక సారి చూడాల్సిన అవసరం ఉంది.
ఆంగ్లంలో "ప్లేజిరైజ్" అనే ఒక పధం ఉంటుంది దాని అర్ధం మరొక వ్యక్తి యొక్క ఆలోచనలు లేదా పనిని సదరు వ్యక్తి అనుమతి లేకుండా తస్కరించి తమ స్వంతం అని ప్రచారం చేసుకోవడం. ఈ ప్లేజిరైజ్ అనే పదానికి తెలుగునాట సర్రిగా సరిపోయే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఎవరో ప్రారంభించిన పనిని తన ఖాతాలో వేసుకుని ప్రచారం చేసుకోవడంలో మాహా దిట్ట మన చంద్రబాబు గారు.
పైన చెప్పిన మాటలకి బలం చేకూరాలంటే చంద్రబాబు గారు మరోకరి ఆలోచనలని, పనిని తస్కరించి తన ఘనతగా ప్రచారం చేసుకున్న కొన్ని ఘటనలు చెప్పుకోవాలి, అవేంటో వరుస క్రమంలో చూస్తే నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి గారు మాధాపూర్ ప్రాంతంలో శంకుస్థాపన చేసిన టెక్నాలజీ పార్క్ తన ఘనతే అని చెప్పుకున్నారు, 1982లో ఇందిరా గాంధీ గారు ప్రారంభించిన డ్వాక్రా గ్రూపులు తన ఘనతే అని చెప్పుకున్నాడు. 1995 ఆగస్టులో వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న జ్యోతి బసు గారు అప్పటి టెలికాం మంత్రిగా ఉన్న సుక్రం గారికి మొదటి మొబైల్ ఫొన్ నుండి కాల్ చెసి భారత దేశంలో మొదటిసారిగా సెల్ ఫోన్ రివల్యుషన్ కి నాంది పలికారు. కానీ ఆ సెల్ఫోన్లు తెచ్చింది నేనే అని ప్రచారం చేసుకుంటారు చంద్రబాబు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. పక్క వారి ఆలోచనలను, పనిని తస్కరించడంలో ఆరితేరిపోయిన చంద్రబాబు గారు ఆఖరికి దేశ సంపదగా మారిన మాహా వ్యక్తి అయిన మన అబ్దుల్ కలాం గారిని కూడా వదలలేదు.
చంద్రబాబు గారు ఈ మధ్య ఒక పత్రికా విలేఖరల సమావేశంలో మాట్లాడుతూ "విజన్ 2020ని నేనే మోదట తయారు చేశానని, అప్పుడు అబ్దుల్ కలాం గారు తన దగ్గరికి వచ్చి మీరు విజన్ 2020ని ఎల తయారు చేశారని అడిగి ఆ విజన్ 2020 ప్రతులని తీసుకుని చూసి, దాని ఆదారంగానే కలాం గారు దేశానికే విజన్ 2020ని తయారు చేశారని, దానికి సంభందించిన పుస్తకాలు కూడా తరువాత వచ్చాయని చెప్పుకోచ్చారు. ఇది ఎంత పచ్చి అబద్దమో , తన ప్రచార పిచ్చితో ఆఖరికి అబ్దుల్ కలాం గారి లాంటి మహా వ్యక్తిని సైతం ఎంతలా అవమానించారో కాస్త లోతుగా ఈ వ్యవహారాన్ని పరిసీలిస్తే తెలుస్తుంది.
నిజానికి ఈ దేశంలో మొట్టమొదట విజన్ 2020 అనే ఆలోచన చేసిన వ్యక్తి మనందరికి ఎంతో గర్వకారణమైన మహా మనిషి మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఓ పదేళ్ల బాలిక అబ్దుల్ కలాం గారికి ఇచ్చిన సమాధానం కలాం గారిని విజన్ 2020 ఆలోచన వైపు అడుగులు వేసేలా చేసింది. కలాం గారి ప్రశ్నకు నాకు అభివృద్ధి చెందిన భారత్లో జీవించాలనుందని ఆ బాలిక చెప్పిన సమాధానమే 1997లోనే విజన్ 2020 అనే పధాన్ని సృష్టించింది.
1997 డిసెంబర్ 2వ తేదీన రవింద్రభారతిలో డాక్టర్ మర్రిచెన్నారెడ్డి ప్రధమ స్మారకోత్సవంలో అబ్దుల్ కలాం గారు ప్రసంగిస్తూ, 1992లో తాను డిల్లీ వెల్లిన తరువాత తనకి "టెక్నాలజీ ఇంఫర్మేషన్ ఫోర్కాస్టింగ్ అండ్ అసెస్స్మెంట్ కౌన్సిల్ (టీఐఎఫ్.ఏసీ) కలిసి పనిచేసే అవకాశం వచ్చిందని' స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి దేశం ఇంకా అభివృద్ది చెందుతున్న దేశంగానే ఉందని దీనికి గల కారణాలను టెక్నాలజీ ఇంఫర్మేషన్ ఫోర్కాస్టింగ్ అండ్ అసెస్స్మెంట్ కౌన్సిల్ లో చర్చించేవాళ్ళమని, మన దేశం అభివృద్ది చెందిన దేశంగా మార్చేందుకు ఒక ప్రణాళికను ఎందుకు రూపొందించకూడదనే ఆలోచనతోనే వందలాది నిపుణులతో కలిసి విజన్ 2020ని రూపోందించామని తెలిపారు.
ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో జరగడం, భారతరత్న అబ్దుల్ కాలం గారి విజన్ 2020 ప్రసంగం బాగా ప్రజలని ఆకట్టుకోవడంతో, వెంటనే ఆ పధాన్ని హైజాక్ చేసే కార్యక్రమం మోదలుపెట్టారు చంద్రబాబు. పక్కవారి ఆలోచనలను హైజాక్ చేయడంతో పాటు చేసే ప్రతిపనిలో ఒక స్కాం కూడా కచ్చింతంగా ఉండాలి కాబట్టి విజన్ 2020 పేరున ఆ స్కాం కార్యక్రమానికి కూడా తెరలేపారు చంద్రబాబు.
1998 నవంబర్ 24లో ఆంధ్రప్రదేశ్ శాశన సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ సభులు విజన్ 2020 డాక్యుమెంట్ పై అడిగిన ప్రశ్నకి తెలుగుదేశం సభ్యుడు అశోఖ్ గజపతి రాజు సమాధానం చెబుతూ ఇంకా సదరు విజన్ 2020 డాక్యుమెంట్ పూర్తి అవ్వలేదని చెప్పుకోచ్చారు. ఇక ఆ డాక్యుమెంట్ తయారీ పూర్తవ్వగానే 1999 ఫెబ్రవరీలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆ డాక్యుమెంట్ ని నాటి గవర్నర్ గారిచే అసంబ్లీలో చదివించి తాము ఎంతో ముందుచూపుతో ఉన్నాం అని గొప్పలు చెప్పుకున్నారు.
పులిని చూసి నక్క వాతపెట్టుకునట్టు అబ్దుల్ కలాం గారి విజన్ 2020 కార్యక్రమాన్ని చూసి అదే పేరుతో కాపీ కొట్టిన చంద్రబాబు తాను కూడా అబ్దుల్ కాలాం అంత గోప్పవాడిగా ఇకపై దేశంలో కీర్తించబడుతానని ఊహించుకున్నాడు. కానీ కధ అడ్డం తిరిగి 2.5 కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు చేసి అమెరికా కన్సల్టెంట్ "మకెన్సీ కంపెనీ" తో తయారుచేయించుకున్న ఆ 337 పేజీల విజన్ 2020 డాక్యుమెంటులో పసలేని ఆలోచనలతో నవ్వులపాలయ్యాడు. భారత పారిశ్రామిక సమాఖ్య ఒక సదస్సును హైద్రబాద్ లో ఏర్పాటు చేసింది, ఈ సదస్సుకి 25మంది స్విస్ వాణిజ్యవేత్తల బృందం స్విజ్జర్లాండ్ ఆర్ధిక మంత్రి పాస్కల్ కుప్పే ఆద్వర్యంలో సదస్సులో పాల్గోన్నారు. అయితే ఈ సదాస్సుకు వచ్చిన చంద్రబాబు తన విజన్ 2020 డాక్యుమెంట్ తీసుకుని చదవగానే కాసేపు విన్న స్విజ్జర్లాండ్ ఆర్ధిక మంత్రి పాస్కల్ కుప్పే చంద్రబాబు ప్రసంగానికి అడ్డు తగిలి మాదేశంలో ఎన్నికల ప్రచారంలో కూడా ఇటువంటి అతిసయోక్తులు చెప్పరని, ఇలా ప్రజలని మోసం చేసే ప్రకటనలు, ఆచరణ సాధ్యంకాని పధకాల రూపకల్పణ లాంటివి చేస్తే మాదేశంలో నీలాంటి రాజకీయ నాయకుడిని జైల్లో కానీ పిచ్చి ఆసుపత్రిలోకాని పడతారని చంద్రబాబు విజన్ 2020 కాగితాల్లోని డోల్లతనాన్ని బయట పెట్టారు.
ఒక్క స్విస్ మంత్రే కాదు, ప్రపంచ ప్రఖ్యత రాజకీయ వక్త జార్జ్ మాంబిట్ చంద్రబాబు విజన్ 2020 లోని అంశాలని తూర్పారబట్టాడు. అలాగే అందరికి సుపరిచితుడైన సాయినాధ్ పాలగుమ్మి గారు కూడా విజన్ 2020 ని తీవ్రంగా తప్పుపట్టారు. ఇలా విజన్ 2020 పేరున అన్నివైపుల నుండి తీవ్ర విమర్శలు ఏదుర్కున్న చంద్రబాబు ఆ తరువాత కాలంలో వాటిని చెత్తబుట్టలో పాడేశారు. ఇక మరో కోణంలో చంద్రబాబు తీసుకున్న ఈ విజన్ 2020 కార్యక్రమాన్ని పరిసీలిస్తే ఇందులో మరో భారీ స్కాం కూడా దాగి ఉంది.
ఇంటర్నేషనల్ స్కూల్ అఫ్ బిజినెస్ ఐఎస్బీ ఏర్పాటు చేస్తాం అని కర్నాటకా, మహారాష్ట్ర వాళ్ళ దగ్గరికి ఐఎస్బీ వారు వెళ్ళగా, అక్కడి ముఖ్యమంత్రులు మీరు కోరిన భూమి ఉచితంగా ఇస్తాం కానీ మీరు ఇక్కడ విద్యార్దులకు 30 నుండి 50% కోటా తప్పనిసరిగా అమలుపరచాలని షరతులు విధించారు. కానీ చంద్రబాబు మాత్రం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు వలే సోంత రాష్ట్ర విద్యార్ధుల గురించి ఆలోచించకుండా ఐఎస్బీ వాళ్ళకి 250 ఎకరాలు భూముని కట్టబెట్టాడు. దీంతో ఎలాంటీ షరతులు లేకుండా ఉచితంగా 250 ఎకరాల భూమి దోరకడంతో ఐఎస్బీ వాళ్ళు హైద్రబాద్ లో క్యాంపస్ పెట్టారు.
ఈ ఐఎస్బీ రావడానికి చంద్రబాబు ఇంకా రజత్ గుప్తా అనే వ్యక్తి పనిచేశారు. ఈ రజత్ గుప్తా మకెన్సీ కంపెనీలో పనిచేసేవాడు ఈ ఐఎస్బీ కి ఉచితంగా 250 ఎకరాలు కేటాయించి ఇక్కడికి వచ్చేలా డీల్ సెట్ చేసినందుకు రజత్ గుప్తా పనిచేస్తున్న మెకన్సీ కంపెనీకి విజన్ 2020 డాక్యుమెంట్ తయారు చేసే కాంట్రాక్ట్ రూపంలో దానికి 1999లోనే 2.5 కోట్లు ఆ కంపెనీకి కట్ట బెట్టాడు. ఆ డాక్యుమెంట్ తరువాత చెత్త బుట్టలోకి వెళ్ళింది. ఈ రజిత్ గుప్తా మాత్రం అమెరికాలో ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో 2ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాడు. ఇలా చంద్రబాబు చేసే స్కాములు ఒకదానికి ఒకటి మెళిక వేసుకుని బయటికి మాత్రం ప్రపంచ స్థాయి అభివృద్ది అని చెప్పుకుంటూ లోపల మాత్రం కోటానుకోట్లు కొల్లగొట్టే స్కాములతో నిడిపోయి ఉంటాయి.
అబ్దుల్ కలాం గారు మొట్టమోదటగా ప్రపంచానికి పరిచయం చేసిన విజన్ 2020 అనే పధాన్ని చంద్రబాబు కబ్జా చేయడమే కాకుండా దానిలో సైతం కోటాను కోట్ల అవినీతికి పాల్పడి జోబులు నింపుకున్నారు. ఇవన్ని ప్రజలకి తెలియని విషయాలు, తమకి వంత పాడే పత్రికలు రాసిందే కదా జగం నమ్మేది, ఇలాంటి చీకటీ కోణాలు తమ పత్రికల్లో ఎలాగో రావు అనుకుంటూ తాను అబ్దుల్ కలాం గారి దగ్గర కాపీ కొట్టిన విజన్ 2020ని అబ్దుల్ కలాం గారే కాపీ కొట్టారని చెబుతూ దేశం గర్వించ దగ్గ అబ్దుల్ కలాం గారిని సైతం అవమానపరచడానికి వెనకాడలేదు చంద్రబాబు.
No comments: