"వైయస్సార్" తిరుమల ఏడు కొండలని రెండు కొండలు చెద్దాం అనుకున్నారా ? ఇందులో నిజం ఎంత ?
YS Rajashaker Reddy Tirumala Hills Facts
2005లో తిరుమల గ్రామంలో పంచాయతి ఎన్నికలు జరగాలని నాటి ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు ఒక అనామకుడిని అడ్డు పెట్టి హైకోర్టులో కేస్ వేయించారు.
ఈ కేసులో టీడీపీ వారి వాదన ఎంటంటే "తిరుమలలో ఒక స్థానిక సంస్థ అనేది లేకపోవడం, ఎన్నికయిన పాలనా సంస్థ లేకపోవడం రాజ్యాంగ విరుద్ధమని. 1993లో రాజ్యాంగాన్ని 73, 74వ సవరణల ద్వారా మార్చిన తరువాత దేశంలో ఎక్కడా కూడా స్థానిక సంస్థలు లేకపోవడం, ఎన్నికైన స్థానిక పాలనాయంత్రాంగం లేకపోవడం జరగడానికి వీలులేదని. పెద్ద ఊరయితే మునిసిపాలిటీ ఉండాలి, చిన్న ఊరయితే పంచాయితీ ఉండాలి. పంచాయితీకి తగినంత జనాభా లేనట్లయితే పక్కనున్న ఏదైనా గ్రామ పంచాయితీలో భాగం చేయాలి. అంతే తప్ప స్థానిక సంస్థ ఏదీలేని మానవ ఆవాసం ఉండడానికి వీలులేదని" కొర్టులో కేసు వేయించారు.
అయితే తిరుమల పవిత్ర క్షేత్రంలో ఆధ్యాత్మికం తప్ప రాజకీయం తగదనే ఉద్దేశంతో 2005న పంచాయితి రాజ్ మరియు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న జేసి దివాకర్ రెడ్డి గారి ఆద్వర్యంలో ప్రభుత్వం 2005 సెప్టెంబర్ 26న ఒక జీఓ విడుదల చెసింది (GO No 338).
ఆ జీఓలో తిరుమలలో 27.5 చదరపు కిలోమీటర్లలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి, కార్యాలయాలు, ఫంక్షన్ హాళ్ళు, యాత్రికుల ప్రయొజనాలకోసం ఏర్పర్చిన గ్రుహాలు, మరియు చుట్టుపక్కన ఉన్న ఇళ్ళు అన్ని కలిపి ఒక పవిత్ర స్థలంగా ఇక్కడ ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు, మీటింగులు జరగటానికి వీలు లేదని చెబుతు జీఓ ని విడుదల చేశారు.
(రాజకీయాలకి దూరంగా తిరుమల ఉండాలని ఆశించి వైయస్సార్ గారు ఈ జీఓ ఇచ్చారు)
మనుషులు సంచారం ఉన్నంత మేరకు తిరుమల గ్రామం విస్తీర్ణం ఇంతా అని చెబుతూ వైయస్సార్ గారు ఈ జీఓ ఇవ్వడానికి ఆదారంగా తీసుకున్నది. గతంలో ఉన్న జీవోలు
గతంలో 1975 డిసెంబర్ 2 న విడుదల చెసిన GO No 1605, మరియు 4 నవంబర్ 1965 విడుదల చెసిన GO No 1784 ని ( కింద ఇచ్చిన 1980 హైకోర్టు జడ్జ్మెంట్ కాపిలో ఆ జీ.ఒ నెంబర్లు చూడొచ్చు)
అలాగే 1986లో ఎన్టీఆర్ దేవాలయాల చట్టంలో అర్చకుల వారసత్వపు హక్కును రద్దు చెయాలనే ఆలోచనతొ జస్టిస్ చల్లా కొండయ్య నెత్రుత్వంలో ఒక కమిటీ వేశారు ఆ కమిటి కూడా స్వామివారి ఆలయం చుట్టు ఉన్న 10.1/3 చదరపు మైళ్ళ విస్తీర్ణ ప్రాంతం మాత్రమే దేవస్తానానికి మంజూరు అయిందని చెప్పారు.. ( ఇక్కడ కూడా ఆ కమీషన్ ఏడుకొండల విస్త్రీణం మోత్తం తిరుమల గ్రామమని చెప్పలేదు)
ఇంకా తిరుమల పవిత్రతని కాపాడటానికి కమీషన్ తిరుమలలో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకి తావు ఇవ్వకూడదని కూడా చెప్పారు కాని ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ వాటిని పట్టించుకొకుండా , కేవలం అర్చకుల వారసత్వపు హక్కు మాత్రమే రద్దు చేశారు. కాని దీనినే వైయస్సార్ తిరుమల పవిత్రతను కాపాడటానికి అమలు చేశారు. వైయస్సార్ గతంలో వచ్చిన జీవోలు, కమీషన్ల రిపోర్టుల ఆదారంగా తీసుకుని ఉదహరిస్తు అందులో ఉనట్టే చెప్పారు.
మిగత స్థలం అంత అడివి కాబట్టి అది కెంద్ర చెతులో ఉంటది కాబట్టి జీవోలో వాటి ప్రస్తావన ఉదహరించలేదు. ఉదహరించే అవకాశం చట్టప్రకారం కూడా వైయస్సార్ గారికి లేదు. ఈ జి.ఒ విడుదల చెసింది అప్పటి పంచాయతి రాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరి ఐఏఎస్ ఎం.శామ్యూల్ అనే అధికారి.
ఈ జి.ఒ ని పట్టుకుని ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టి, వైయస్సార్ తిరుమల ఏడు కొండలని రెండు కొండలు గా చేశారని ప్రచారం అందుకున్నారు - ( వాస్థవం గా చూస్తే ఆ జి.ఒ ముఖ్య ఉద్దేశం జనసంచారం మటికి ఉన్న తిరుమల ప్రాంతం లొ ఎలాంటి రాజకీయ కర్యాకలాపాలు ఉండటానికి లేదు అని చెప్పటం) 1925 నుండి విలేజ్ రికార్డ్స్ లొ ఉన్న ఏరియా ఇంతే - ఇందులొ వైయస్సార్ మార్చింది లేదు.
ప్రతిపక్షాలు మాటలు నమ్మి కొంత మంది సాదువులు 2006 జులై 15 న నిరసన వ్యక్తం చేశారు ఇలా చేస్తూ వారు తిరుమలని కిలొ మీట్లర్లలా కాకుండా ఏడు కొండలు అని మార్చి జి.ఒ ఇవ్వాలి అని అడిగారు, అలాగే 27 జులై 2006 న టి.టి.డి అదారిటి ప్రభుత్వాన్ని అభ్యర్ధిస్తు తిరుమల 27.5 చదరపు కిలొ మిటర్లు కాదు అడవితొ సహా అంత కలిపి 332 చదరపు కిలొ మీటర్ల ప్రాంతం అని కొత్త జి.ఒ ఇవ్వాలి అని అడిగారు.
అదే రొజు ప్రభుత్వ కెబినెట్ అప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానం కింద లేని అటవి ప్రాంతాన్ని వీరికి ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుని కెంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి అది రాగానే ప్రభుత్వం 2007 జూన్ 2న ఏడు కొండలు అంటే శేషాద్రి, నారాయణాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వెంకటాద్రి, ౠషబాద్రి తిరుమలకి సంభందిచిన పవిత్ర ప్రదేశం అని జి.ఒ నెంబర్ 746 ని విడుదల చేశారు , దీనితొ పాటు రాష్ట్రంలొ ఉన్న దేవాలయాల దగ్గర అన్యమత ప్రచారం నిషిద్దం అని 747 జి.ఒ ని విడుదల చేశారు వైయస్సార్.
వైయస్సార్ అదే 2006 ఆగస్టున తిరుపతిలొ "యస్.వి వేదిక్ విశ్వ విద్యాలయం" ప్రారంబిస్తు తిరుమల కొండల విషయంలో తెలుగుదేశం పార్టీ మీడియాని అడ్డుపెట్టుకుని సాగిస్తున్న తప్పుడు ప్రచారాలు ఆపాలని, ఎట్టి పరిస్తుతులలొను తిరుమల, ఏడు కొండలు అంగులం కూడా కదిలించాలనే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని, ఆ పాపం కి వడికట్టాము అనే ప్రచారం మానుకొవాలి అని హితవు పలికారు.
ఇక్కడ మనం ఆలొచించాల్సింది
1) హిందు మెజారిటి దేశం లొ రొజు లక్షలలొ భక్తులు వచ్చే ప్రదేశం ని రెండు కొండలు చెస్తాం అనే ఆలొచన రాజకీయం లొ ఉండే వారు చేస్తారా ??
2) తిరుమల ఆద్వర్యం లొ లేని అటవి ప్రాతం ని 1975, 1965 జొ.లొ లేదు కాబట్టి 2005 జి.ఒ లొ కూడ పెట్టలేదు ఇందులొ వై.యస్ తప్పు ఎంటి ?
3) నిజంగా 7 కొండలు తిరుమల వే అని ప్రకటించే హక్కు తనకి ఉంతే కెంద్ర అటవిశాక నుండి అనుమతి వచ్చే దాక సంవత్సరం పాటు ఎందుకు వై.యస్ ఎదురు చూశారు.
ఇలా రాజకీయాల నుండి తిరుమల దివ్యక్షేత్రం పవిత్రతని కాపాడుదాం అని ఆలొచించిన వై.యస్ మీద కేవలం రాజకీయ లబ్ధి కొసం దేవుడిని కూడా అడ్డం పెట్టుకుని రాజకీయ చేశారు తెలుగుదేశం వారు , దీనికి బాబు గారిని మొసే పత్రికలు వంత పాడాయి - హిందు ధర్మం మీద అత్యంత విశ్వాసం ఉన్నవాళ్ళ మనొభావాలు గాయపడ్డాయి - లేదు ప్రతిపక్షాలు వాటి అనుభంద మీడియా గాయ పడేలా చేశారు... ఇప్పటికైనా విజ్ఞులు నిజాలు గ్రహిస్తారు అని ఆసిస్తున్నాం...
"వైయస్సార్" తిరుమల ఏడు కొండలని రెండు కొండలుగా చేద్దాం అనుకున్నారా ? ఇందులో నిజం ఎంత ??
Reviewed by surya
on
7:26 AM
Rating:

No comments: