2017 చంద్రబాబు పరిపాలనలో కర్నూలు నగర శివారులోని లక్ష్మీగార్డెన్లో ఉంటున్న ఎస్.రాజు నాయక్, ఎస్.పార్వతిదేవి దంపతుల కుమార్తె సుగాలి ప్రీతి(14) దిన్నెదేవరపాడు వద్దనున్న టీడీపీ నేత వి.జనార్దన్రెడ్డికి చెందిన కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో పదో తరగతి చదివేది. 2017 ఆగస్టు 19న ఫ్యాన్కు ఉరి వేసుకుని చనిపోయినట్లు స్కూల్ యాజమాన్యం చిత్రీకరించింది. అయితే.. తమ కుమార్తె ఉరి వేసుకుని చనిపోలేదని, స్కూల్ అధినేత కొడుకులు బలవంతంగా రేప్ చేసి చంపేశారని తల్లిదండ్రులు ఆరోపించారు.
2017 నుండి ఈ కేసులో ఉన్న నిందితులని కాపాడేందుకు టీడీపీ నేతలు మాండ్ర శివానందరెడ్డితో పాటు, గౌరు వెంకటరెడ్డి కూడా అడుగడుగునా ప్రయత్నించారని బాలికల తల్లిదండ్రులు ఆరోపిస్తూ వచ్చారు. ఈ నేపధ్యంలో 2017 నుండి 2019 ఎన్నికల వరకు ఈ కేసులో ఎలాంటీ పురోగతీ లేకుండా సుగాలీ ప్రీతీ తల్లితండ్రులకి ఎలాంటీ న్యాయం జరగలేదు. నాడు పవన్ కళ్యాణ్ సైతం చంద్రబాబు ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ ఈ కేసు విషయంలో ఎక్కడా మాట్లాడింది లేదు. పైగా ఆసమయంలోనే ఆదరాలు చెరిపివేసే ప్రయత్నం జరగడంతో నిందితుల DNA మ్యాచ్ అవ్వడంలేదని 2018లోనే కోర్టు కూడా అభిప్రాయ పడి వారికి బేయిల్ ఇచ్చింది. కనీసం చంద్రబాబు ప్రభుత్వం వారికి చట్ట ప్రకారం రావాల్సిన పరిహారం కూడా ఇవ్వలేదు. ఇది నాటి పవన్ కళ్యాణ్ మద్దతుతో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ప్రవర్తించిన తీరు. సుగాలీ ప్రీతి తల్లితండ్రులు మాత్రం పాదయాత్రలో ఉన్న జగన్ ని కలిసి జరిగింది చెప్పుకున్నారు. జగన్ కూడా అధికారంలోకి రాగానే న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చెప్పిన విధంగానే జగన్ ప్రభుత్వం కేసుని తిరగతోడటం మోదలుపెట్టింది. 2019 అక్టోబర్ లోనే అడిషినల్ ఎస్పీ స్థాయి అధికారిణి రమాదేవి గారిని ఈ కేసు విచారణ నిమిత్తం జగన్ ప్రభుత్వం నియమించారు. సుగాలీ ప్రీతీ తల్లితండ్రులు కూడా జగన్ ప్రభుత్వం ఈ కేసును తిరిగి విచారణ ప్రారంభించడం స్వాగతిస్తున్నాం అని మీడియా ముఖంగా ప్రకటించారు.
దీంతో రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్ సుగాలీ ప్రీతీ హత్య జగన్ ప్రభుతంలో జరిగిననట్టు ఎక్కడలేని హడావిడి చేశారు. సిట్ విచారణ మద్యలో ఉండగా 2019 డిసెంబర్ లో హైద్రబాద్ లో దిశా నిందితుల ఎన్కౌంటర్ జరిగిన నేపధ్యంలో, పవన్ కళ్యాణ్ సుగాలీ ప్రీతీ కేసుని సాల్వ చేయాలని లేని పక్షంలో కర్నూల్ లో ర్యాలీ చేస్తానని ప్రకటించారు. సుగాలీ ప్రీతీ తల్లితండ్రులని మంగళగిరి ఆఫీసుకు పిలిపించుకుని సోషల్ మీడీయాలో ట్రెండ్ చేయించుకున్నారు. 2020 ఫిబ్రవరీ 18న జగన్ కర్నూల్ ప్రోగ్రాం ఫిక్స్ అవ్వగానే... పవన్ కళ్యాణ్ 2020 ఫిబ్రవరీ 12న కర్నూలు వెళ్ళీ ర్యాలీ చేసి కేసుని సీబీఐ కి రిఫర్ చేయాలని సుగాలి ప్రీతీ తల్లీ చేత డిమాండ్ చేయించారు.
ఈ నేపధ్యంలో డాక్టర్ వైయస్సార్ కంటివెలుగు పధకం మూడవ దశని ప్రారంభించటానికి 2020 ఫిబ్రవరీ 18న కర్నూల్ వచ్చిన జగన్ ను సుగాలీ ప్రీతీ తల్లితండ్రులు కలిసి ఈ కేసును సీబీఐ కి అప్పగించలని జగన్ ను కోరారు. లేదు కోరేలా వాళ్ళని పవన్ కళ్యాణ్ అండ్ టీం ప్రేరేపించారు. దీంతో జగన్ సైతం వారి తల్లితండ్రుల అభిష్టం మేరకు కేసును సీబీఐకి అప్పగిస్తూ 2020 ఫిబ్రవరీ 28న జీవో 37 జారీ చేశారు. దీంతో సీబీఐకి కేస్ అప్పగించడం మంచి పరిణామం అంటూ లేఖను విడుదల చేశారు పవన్ కళ్యాన్
సీబీఐకి కేస్ అప్పగించాక కూడా పవన్ కళ్యాణ్ ప్రతీ వేదికలో జగన్ పై నిందలు మోపుతూ ఎంత రాజకీయంగా ఈ కేసును వాడుకున్నారో కోత్తగా చెప్పనవసరంలేదు. తానూ కేంద్ర బీజేపీ పెద్దలతో సన్నిహితంగా ఉన్న కూడా ఏనాడు కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలని ఈ కేసు విషయం మాట్లాడని పవన్ కళ్యాణ్ ఏపీలో మాత్రం నిందలు జగన్ ప్రభుత్వంపై మోపూతూ వేదికలపై ఊగిపోయారు. కానీ నిందితులు తేలుగుదేశంకి చెందిన వారని ఎక్కడా కూడా మాట్లాడకుండా జాగ్రత్త పడ్డారు. కనీసం చనిపోయిన బాలిక తల్లితండ్రులు ఎవరిపైన ఆరోపిస్తున్నారో కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. ఇది పవన్ కళ్యాణ్ నిందితులని కాపాడటానికి చేసిన కుట్ర కాక మరేమిటి?
జగన్ ప్రభుత్వం సుగాలీ ప్రీతీ వాళ్ల తల్లితండ్రుల అభిష్టం మేరకు కేసునును సీబీఐ కి ఇచ్చినా వారి కుటుంభానికి మాత్రం అండగానే నిలబడింది 2021 నవంబర్ లో ప్రీతి తల్లిదండ్రులకు 8 లక్షల నగదు, 5 సెంట్ల ఇంటి స్థలం, ఐదెకరాల పొలాన్ని కూడా జగన్ ప్రభుత్వం ఇచ్చింది. ప్రీతి తండ్రి రాజు నాయక్కు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చింది. (ఇది చంద్రబాబు పాలనలో జరిగినా , చంద్రబాబు కనీసం పైసా కూడా ఇవ్వలేదు వీరికి) పవన్ కళ్యాణ్ మాత్రం కేసును రాజకీయంగా వాడుకుని తను అధికారంలోకి రాగానే మోదట పరిష్కరించే కేసు సుగాలీ ప్రీతీ కేస్ అంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చుకుంటూ తిరిగారు.
కోరుకున్న విధంగానే 2024లో అధికారలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయితే అయ్యారు కానీ సుగాలీ ప్రీతీ కేసు పై ఎక్కడా మాట్లాడలేదు. బీజేపీతో పోత్తులో ఉన్నా కనీసం సీబీఐ ఈ కేసును ఎలా దర్యాప్తు చేస్తుందో కూడా అడిగిన దాఖలాలు లేవు. ఇప్పుడూ ఏకంగా సీబీఐ తమకున్న పరిమిత వనరులతో ఈ కేసు దర్యాప్తు చేపట్టడం సాధ్యం కాదని హైకోర్టుకు వివరించారు. సీబీఐ దర్యాప్తు చేసేలా ఆదేశించాలని కోరుతూ ప్రీతి తల్లిదండ్రులు దాఖలు చేసిన ఈ పిటిషన్ను కొట్టేయాలని హైకోర్టును కోరారు. దీంతో ఈ కేసు నీరుకారిపోయింది అని స్పష్టంగా తేలిపోయింది.
లోతుగా చూస్తే 2019లో జగన్ ప్రభుత్వం కేసును విచారిస్తే సుగాలీ ప్రీతీ తల్లితండ్రులు ఆరోపిస్తున్న తెలుగుదేశం నేతల గుట్టు ఎక్కడ భయట పడుతుందో అనే పవన్ కళ్యాణ్ చేత పావులు కదిపి సుగాలీ ప్రీతీ కేసు.. సుగాలీ ప్రీతీ వాళ్ళ తల్లితండ్రుల చేతే సీబీఐకి వెళ్ళేలా చేసి ఇప్పుడు నీరు కారిపోయేలా పవన్ కల్యాణ్ పావులు కదిపారా అనే అనుమానం రాక మానదు.
ఈనేపధ్యంలో తన కూతురు 8వ వర్ధంతి సంధర్భంగా సుగాలీ ప్రీతి మృతికి కారణమైన కారకులను కఠినంగా శిక్షించాలని, తమకు ఇచ్చిన మాట ప్రకారం న్యాయం చేయాలని కోరుతూ కర్నూలు నుంచి అమరావతికి న్యాయపోరాట యాత్రను చేపట్టేందుకు ప్రీతి తల్లిదండ్రులు సిద్దంవ్వగా కూటమి ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. ఆమే కోర్టులో కేసు వేశారు అనుమతి కోసం.. కేంద్ర ప్రభుత్వంతో పోత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ తన చిత్తశుద్దిని నిరూపించుకోవాల్సిన సమయం ఇది.

No comments: